ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రాముడు Vs కైకేయి సంభాషణ, భరతనుకి రాజ్యం రాముడికి అరణ్యం|| Ramudi vs Kaikeyi Sambhashana, Bharathuniki Rajyam Ramuniki Aranyam || Ramayanam || Epsode 53

 

రాముడు  వనవాసానికి అంగీకరించడం

అప్పుడు రాముడు కైకేయితో  అమ్మా! నువ్వు చెప్పినట్లే నడచుకుంటాను. రాజు నీకు ఇచ్చిన వరాలు రెండూ తప్పక నెరవేర్చగలడు. ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చి సత్యవ్రతాన్ని కాపాడుకోగలడు..

నువ్వు చెప్పినట్లుగా నారబట్టలు ధరించి, జటాధారినై అడవులందే నివసిస్తాను. ఈ మాత్రానికే నా తండ్రి నన్ను ప్రేమపూర్వకంగా పలకరించటం లేదా? నా హితం కోరేవాడు, పూజ్యుడు. అంతేగాక మహారాజు అయిన నా తండ్రి ఆజ్ఞాపిస్తే నేను ఆయన ఆజ్ఞను శిరసావహించనా? అది నా కర్తవ్యం కాదా? నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞుడుగానే ఉంటాను.

అమ్మా! భరతుని రాజ్యాభిషేకం గూర్చి తండ్రిగారు ఒక్క మాట నాతో చెప్పినా నేను సంతోషంగా అంగీకరించేవాడను. నన్ను ఎవరూ ప్రేరేపించకపోయినా, నేనే తమ్ముడైన భరతుని కోసం నా సర్వస్వాన్ని ఆఖరుకు నా ప్రాణాలను కూడా సంతోషంగా అర్పించేవాణ్ణి.

అమ్మా! తండ్రిగారే స్వయంగా నీ ప్రియమైన కోరికను తీర్చమని అడిగితే, నా సర్వస్వాన్ని తండ్రిగారి ప్రతిజ్ఞ నెరవేర్పడానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తమ్ముడు భరతునికి సర్వస్వం ఇవ్వగలనని విడిగా చెప్పాలా?

అమ్మా! నువ్వు తండ్రిగారిని ఓదార్పు. మహారాజు దైన్యంగా నేలచూపులు చూడటం. బాగాలేదు. శత్రుసంహారకుడు, ఎదిరింప శక్యం కానివాడు అయిన దశరథ మహారాజుచే కన్నీరు పెట్టించకు. ఆయనను అనునయించు.

అమ్మా! రాజాజ్ఞగా కబురుపంపి వెంటనే భరతుణ్ణి ఇక్కడకు పిలిపించు. నేను వెంటనే ముందూ వెనుకా ఆలోచించకుండా అరణ్యాలకు బయలుదేరుతున్నాను, అట్లాగే వెంటనే భరతునికి కూడా రాజ్యాభిషేకం చేయించు అని అన్నాడు.

అప్పుడు కైకేయి రాముడితో  రామా! ఈ మహారాజు సిగ్గు వలన నీతో స్వయంగా చెప్పలేకపోతున్నాడు.. ఆయన పరిస్థితిని అర్ధం చేసుకో. నువ్వు వెంటనే అడవులకు బయలుదేరి వెళ్ళు, నువ్వు అయోధ్య వదలి వెళ్ళేవరకు నీ తండ్రి స్నానం చెయ్యడు. అన్నం తినడు. కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అడవులకు బయలుదేరు. ఏమాత్రం ఆలస్యం అయినా అది శ్రేయస్కరం కాదని నేను అనుకొంటున్నాను. నువ్వు చెప్పినట్లుగానే వేగంగా చౌడు తీసే గుర్రాలనిచ్చి దూతలను పంపి భరతుణ్ణి పిలిపిస్తాను. అతడు రాగానే రాజ్యాభిషేకం ఏర్పాట్లు జరుగుతాయి. సువ్వు మాత్రం వెంటనే అడవులకు బయలుదేరి నీ తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్పు అని అన్నది.

కైకేయి, రాముల సంభాషణ దశరథుడు విన్నాడు. దుఃఖంతో ఆయన గుండెలు పగిలాయి. ఆ దుఃఖంలోనే అప్రయత్నంగానే 'ఛీ! నా కెంతటి దుస్థితి పట్టింది" అని తిరిగి మూర్చపోయాడు. రాముడు ఆయనను లేవనెత్తి సపర్యలు చేయబోయాడు. అంతట కైకేయి. రామునితో "రాజుకు సేవలుచేసే వంకతో అడవులకు పోవటానికి ఆలస్యం చేస్తున్నావు" అని. పరిపరి విధాలుగా నిందించింది. రాముడు ఆమె మాటలకు ఏమీ వ్యధచెందలేదు.

అప్పుడు రాముడు  అమ్మా! నేను ధనాన్ని ఆశించి గాని, మరో ప్రయోజనాన్ని ఆశించి గాని రాజుకు సేవ చేయడం లేదు. నేను ధర్మాన్ని పాటిస్తున్నాను. నీకు రాజుకు మాట ఇవ్వటంవల్ల నేను ఋషితో సమానుడవయ్యాను. నా తండ్రి ఎం కావాలన్నా నా ప్రాణాలు అర్పించి అయినా ఆయన కోరిక తీరుస్తాను. తండ్రికి శుశ్రూష చెయ్యడం, ఆయన ఆజ్ఞను పాలించడం నా ధర్మంగా భావిస్తాను. మా తండ్రిగారు చెప్పినా చెప్పకపోయినా, నీ మాటే ఆయన ఆజ్ఞగా శిరసావహిస్తాను. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను.
అమ్మా! నీకు నా మీద సర్వాధికారాలు ఉన్నాయి. ఇటువంటిది భరతునికి రాజ్యాభిషేకం విషయమై నాకు చెప్పకుండా తండ్రిగారితో చెప్పావు. అంటే నాపై విశ్వాసం లేదని తెలుస్తోంది.


అమ్మా! వెంటనే బయలుదేరి నా తల్లికి ఈ వార్త చెప్పి, సీతను ఊరడించి, వెంటనే అరణ్యవాసానికి బయలుదేరుతాను. నువ్వు భరతునితో చెప్పి తండ్రికి శుశ్రూషలు చేసేట్లు చూడు. ఇది మన సంప్రదాయం: ధర్మం.

రాముని ధర్మ సమ్మతమైన, ఓర్పుతో కూడిన సంభాషణ అంతా వింటున్న దశరథుడు. భోరున ఏడ్చాడు. అట్లా బిగ్గరగా ఏడుస్తున్న తండ్రి పాదాలకు, తల్లి కైకేయి పాదాలకు రాముడు సమస్కరించాడు. తరువాత రాజమందిరం నుండి బయటకు వచ్చాడు.

ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్లాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగివలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారియై తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు.
ఇంతజరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది.

రామలక్ష్మణులు కౌసల్యామందిరానికి చేరే సమయానికి ఆ మందిరమంతా ఆనందంతో నిండి ఉంది.









                                                                                                                       ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు