Posts

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శ్రీరాముని ధృఢచిత్తం - లక్ష్మణుని కోపం || Sriramuni Drudachittam.... Lakshmanudi Kopam || Ramayanam || Episode 56

Image
  శ్రీరాముని ధృఢచిత్తం - లక్ష్మణుని కోపం    రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు. "తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు. ఆనందంగా ఉండు. ఈ రోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము మరిచిపో, నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి. ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము. మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభ...

కౌసల్యా దుఃఖం… రాముని నిర్ణయం || Koushlya Dukham....Ramuni Nirnayam || Ramayanam || Epsode 55

Image
   రాముడు తల్లికి, లక్ష్మణునకు నచ్చచెప్పడం అప్పుడు లక్ష్మణుడు అమ్మా! కౌసల్యా! అన్నా రామా! దశరథమహారాజు వృద్దుడైపోయినా ఇంకా యౌవనంలోనే ఉన్నానను కొంటున్నాడు. అందువల్ల ఆయనలో భోగాసక్తి తగ్గలేదు. కామంచేత ఒక ఆడదాని మాటలకు బానిసై విపరీతపు నిర్ణయాలు తీసుకున్నాడు. అంతమాత్రం చేత రాముడు ఒక ఆడదానికిచ్చిన మాటకోసం రాజ్యలక్ష్మిని వదులుకోవటం నాకు బొత్తిగా ఇష్టంలేదు. ఆ మాటకు వస్తే రాముడు ఏం తప్పుచేశాడని దేశాన్నుంచి బహిష్కృతుడవుతున్నాడు. అరణ్యాలకు పంపాల్సినంత దోషం అతడు ఏమి చేశాడు? ఎంతటి శత్రువైనా రాముణ్ణి గూర్చి ఒక్క మాట. కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు. రాముడు దేవతలలో పరిగణించదగ్గవాడు. ధర్మబుద్ధి గలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, కపటం లేనివాడు. శత్రువులకు కూడా మేలు చేసే స్వభావం గల రాముణ్ణి ఎందుకొరకు అడవులకు పంపాలి? ఏ తండ్రి అయినా అటువంటి వాడికి ఇలాంటి ఏకపక్షమైన శిక్షను విధిస్తాడా? రామా! ఈ విషయం నలుగురికీ తెలియకమునుపే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుందాం. ధనుస్సును ధరించి, నేను నీ ప్రక్కన ఉంటే నిన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుందో చూద్దాం. నా వాడిబాణాల ధాటికి ఈ అయోధ్యా నగరమే నిర్మానుష్యమైపోతుంది. భరతుని పక్షా...

కౌసల్య దేవి గుండె పగిలిన రోజు || Kowsalya Devi Gunde Pagilina Roju || Ramayanam || Epsode 54

Image
    రాముడు కౌసల్యకు తన వనవాసం గూర్చి తెలుపడం రాముడు దశరథునికి, కైకేయికి నమస్కరించి బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలంతా ఘోల్లున ఏడ్చారు. రాముడు తండ్రి చెప్పినా చెప్పకపోయినా అందరికీ అన్ని పసులు చేసిపెడుతూ ఉండేవాడు. ఎవరి మీదా కోపగించుకొనేవాడు కాదు. ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే వాళ్ళ కోపం మంచులా కరిగిపోయేట్లు మాటలు చెప్పేవాడు. అటువంటి రాముణ్ణి అడవులకు పంపుతున్నారు. మనమంతా దూడలు లేని అవుల్లాగా అయిపోతామే అంటూ ఏడవసాగారు. ఈ ఏడుపులన్నీ వింటూ దశరథుడు మళ్ళీ మూర్చపోయాడు. ఈ రోదన అంతా రాముడు కూడా విన్నాడు. కానీ మనోనిగ్రహంతో మదపుటేనుగులా మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. కౌసల్యాదేవి అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడ చాలాకాలంగా ఉంటున్న వృద్ధుడైన ద్వారపాలకుణ్ణి, మరికొందరిని చూశాడు. వారంతా రాముణ్ణి 'జయీభవా అని, అభినందించారు. అట్లా ముందుకు పోతూనే రెండవ ప్రాకారం దాటాడు. అక్కడ వృద్ధులైన బ్రాహ్మణులున్నారు. రాముడు వారందరికీ నమస్కారం చేశాడు. అట్లా ముందుకుపోయి మూడవ ప్రాకారంలో ప్రవేశించాడు. అక్కడంతా స్త్రీలే ద్వారపాలకులుగా ఉన్నారు. వారంతా పరుగెత్తుకుపోయి కౌసల్యాదేవికి రాముని రాకను తెలియజేశారు. కౌస...