ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రామునిపై అయోధ్య ప్రజల ప్రేమ!💓 || Ramunipai Ayodhya Prajala Prema || Ramayanam || Epsode 51

 

రామునిపై అయోధ్య ప్రజల ప్రేమ!💓


రాముడు రథంలో అయోధ్యానగర వీరుల గుండా వివిధరకాలైన చందన, అగరు ధూపాలచే నిండిపోయిన సుగంధాలను దాటుకుంటూ పోయాడు. వివిధ దేశాలనుండి తనను చూడటానికి వచ్చిన జనసమూహాల్ని చూశాడు. వారంతా తనను, తన వంశాన్ని స్తుతించడం. విన్నాడు.

వీధులకు రెండు ప్రక్కలా ఉన్న రకరకాల అంగళ్ళను చూశాడు. అంగళ్ళలో రాసులుగా పోసిన పట్టువస్త్రాలను, నూలువస్త్రాలను చూశాడు. కొత్తముత్యాలను, పగడాలను చూశాడు. వాటికి ఇంకా బెజ్జాలైనా వేయలేదు. సరికొత్తవి. స్పటికాల్లాంటి రత్నరాసుల్ని చూశాడు. పరిమళ ద్రవ్యాలనమ్మే అంగళ్లను, తినుబండారలనమ్మే అంగళ్ళను, వాటిని విరివిగా కొంటున్న జనాన్ని చూశాడు. ఇంకొన్ని అంగళ్ళలో నిత్యపూజలకోసం పెరుగు, అక్షతలు, పేలాలు, చందనం, పూలు, పండ్లు మొదలైన వస్తువులను విక్రయిస్తున్నారు. వీధుల రెండు వైపులా ఆకాశాన్నంటే పెద్ద పెద్ద మేడల్ని చూశాడు. బ్రాహ్మణులు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే రాముడు ముందుకు సాగిపోయాడు.

దేవేంద్రుని రాజవీథుల్లాగా ఉన్న అయోధ్యాపుర వీధుల్లో జానపదులు గుంపులు గుంపులుగా చేరారు. రామరాజ్యాన్ని గురించి గానం చేశారు. "దశరథ మహారాజు మన రాముణ్ణి యువరాజును చేస్తున్నాడు. అతడి పాలనలో మనం ఏ కొరతా లేకుండా జీవిస్తాం. మనందరికీ ఏ దిగులూ, కష్టమూ రాకుండా రాముడే మనల్ని ఆదుకుంటాడు. ఇకపై మనకు ఎట్లాంటి చీకూచింతా ఉండదు. ఇదంతా మన పూర్వజన్మల పుణ్యఫలం" అని గానం చేస్తున్నారు. వయోవృద్ధులు, ముఖ్యమైన పౌరులు, సహృదయులూ ఆ రధానికి దగ్గరగా వెళ్ళి, బిగ్గరగా "ఓ రామా! నీ రాజ్యపాలన నీ తాతముత్తాతల పరిపాలనను మరిపించేదిగా ఉండాలి.

మమ్మల్నందరినీ ఇదివరకటికన్నా ఎక్కువ సంతోషపెట్టాలి. ఇప్పుడు మాకు అన్నంతో పనిలేదు. నీళ్ళు అంతకన్నా వద్దు. నీ రాజ్యాభిషేకాన్ని కన్నులపండువుగా మేమంతా చూడాలి. మాకు నేత్రానందమే అన్నోదకాలు. నీ రాజ్యాభిషేకం కన్నులారా చూసి మా జన్మలు దన్యం. చేసుకోవాలని కలలు కంటున్నాం" అన్నారు.

రాముడు ఈ ప్రశంసలకు పొంగిపోలేదు. సమభావం ప్రదర్శించాడు. రాముడు రథం దూరమైనా, ప్రజల దృష్టి మాత్రం అతడి నుండి దూరం కాలేదు. అతని వైపే చూస్తూ ఉండిపోయారు. రాముని చూడని వారుగాని రామునిచే చూడబడని వారు గానీ అక్కడ లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని లోకులు నిందించటమేకాదు, తనను తనే నిందించుకుంటాడు. రాముడు చిన్న, పెద్దా తేడా లేకుండా నాలుగు వర్ణాల వారిని సమదృష్టితో చూశాడు. అందువల్ల అందరూ అతణ్ణి ప్రేమించారు. రాముడు చతుష్పథాలను, దేవాలయాలను, చైత్యాలను ప్రదక్షిణం చేస్తూ కైలాస శిఖరంలా తెల్లగా మెరిసిపోయే దశరథుని వర్ధమానమనే రాజప్రాసాదాన్ని చేరుకున్నాడు. మూడు ప్రాకారాలను దాటిన పిదప రాముడు రథం పైనుండి దిగి కాలినడకన బయలుదేరాడు. తన వెంట వచ్చినవారినందరినీ అక్కడే ఆగిపొమ్మన్నాడు. రాముడు ఒంటరిగానే అంతఃపురంలోనికి ప్రవేశించాడు.




                                                                                                                                ←PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు