ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Viswamitra Maharshi Nunchi Sabala Tanani Tanu Ela Kapadukundi?

 

శబళ తనని తను ఎలా కాపాడుకుంది?


వశిష్ఠుడు శబళని రక్షించుకోమని చెప్పాక కామధేనువు ఒక్కసారి అంబా అని అన్నది. దానితో చాలా సేనలు సృష్టించబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుడి సేనలను నాశనం చేయడం మొదలుపెట్టాయి. 


విశ్వామిత్రుడి కళ్ళ ఎదుట తన సేనలు నాశనం అవ్వడం చూసి అతనే స్వయముగా రథం ఎక్కి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేశాడు. 


కామధేనువు సృష్టించిన సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడంతో కామధేనువుకి కోపం వచ్చి ఇంకా సేనలను సృష్టించింది. ఆ సేనలు మళ్ళీ విశ్వామిత్రుడి సేనలను నాశనం చేశాయి. దానితో విశ్వామిత్రుడు దివ్య అస్త్రాలను ఉపయోగించి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేసాడు. 


కామధేనువు సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడం చూసి వశిష్ఠుడు కామధేనువుతో ఇంకా సేనలను సృష్టించమన్నాడు. అప్పుడు కామధేనువు మరల అంబా అని అరిచింది. అలా అరవడంతో సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు, ప్లవులు, యవనులు, శకులు, మ్లేచ్చులు పుట్టారు. వారందరు కలిసి విశ్వామిత్రుడి సేనని నాశనం చేసారు. 


విశ్వామిత్రుడి సేనలు నాశనం కావడం చేత విశ్వామిత్రుడి 100 మంది కుమారులు వశిష్ఠుడి మీదకి వెళ్లారు. వశిష్ఠుడు తనకున్న తపః శక్తులతో వారిని చంపేశారు. తన కుమారులు, సైన్యం నాశనం కావడం కళ్లారా చూసి విశ్వామిత్రుడు చాలా సేపు బాధపడ్డాడు. విశ్వామిత్రుడి  శౌర్యము, సాహసము, ఎందుకు పనికిరాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్నా విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరిగా మిగిలిపోయాడు. ఒక కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుసుకొని అతడికి రాజ్యాభిషేకం చేసి విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు.



Prev                                                                                                                                               Next


Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు