ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Bhagirathudu Gangani Bhumi Medaku Ela tesukuvachhadu?
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
భగీరథుడు గంగని భూమి మీదకు ఎలా తీసుకు వచ్చాడు?
గరుత్మంతుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాను కదా! గరుక్మంతుడు ప్రత్యక్షమయ్యాక
అంశుమంతుడి తో ఇలా అంటాడు,
ఈ భూమిలోని ఏ జలంతో జల తర్పణ చేసిన నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వారు స్వర్గానికి వెళ్లాలి అంటే నీవు స్వర్గంలో ఉండే గంగా జలముతో ఆ భస్మాన్ని తడపాలి అని అలాగే దానికోసం ప్రయత్నించు అని చెబుతాడు.
తరువాత అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశాడు. తన 60 వేల కొడుకులు భస్మం అయ్యారు అని తెలుసుకొని సగరుడు చాలా బాధపడ్డాడు.
తరువాత కొన్ని సంవత్సరాలు సగరుడు రాజ్యపాలన చేసి తన శరీరాన్ని వదిలాడు. తరువాత సగరుడి మనుమడైన అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు, ఆయన 32 వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు లోనే శరీరాన్ని వదిలి వేసాడు.
తరువాత అంసుమంతుడి కుమారుడైన దిలీపుడు రాజ్యపాలన చేశాడు. అతడు గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోయాడు, తరువాత
దిలీపుడి కుమారుడైనా భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకు బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు నాకు సంతానం లేదు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండటానికి నాకు కుమారులు కలిగేలా వరం ఇవ్వండి అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం గంగను భూమి మీదకు పంపించండి అన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరిక నేను తీరుస్తాను, కానీ గంగను భూమి మీదకు వదిలితే దానిని ఆపగలిగే వాడు అక్కడే శివుడు ఒక్కడే, కనుక శివుని కోసం తపస్సు చేయి ఆయన ఒప్పుకుంటే భూమి మీద వస్తుంది అన్నాడు.
అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనవేలి మీద నిలబడి ఒక సంవత్సరం పాటు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సుపై ధరిస్తాను అని అన్నాడు.
అప్పుడు శివుడు హిమాలయాల మీద నిలబడి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. అప్పుడు గంగ గర్వంతో తన మనసులో ఇలా అనుకుంది: నా ప్రవాహంలో శివుడిని కూడా పాతాళానికి తీసుకు వెళ్తాను అని అనుకుని శివుని జటాజూటంలో జారింది.
అలా గంగా ఒక సంవత్సరం పాటు శివుని జటాజూటంలో పడుతూనే ఉంది కానీ, భూమి మీద ఒక్క చుక్క నీరు కూడా పడలేదు అలా శివుని జటాజూటంలోనే తిరుగుతూ ఉంది.
మళ్లీ భగీరథుడు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గంగను బిందు సరోవరం లో వదిలాడు. అప్పుడు ఆ గంగా నది హ్లాదిని, పావని, నళిని అని మూడు పాయలుగా తూర్పు దిక్కుగా వెళ్ళింది. సుచక్షువు, సీతా, సింధువు అనే మూడు పాయలు పడమర దిక్కుకు, ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల గంగ ప్రవహించింది. ఆ అపూర్వమైన ఘట్టం చూడటం కోసం దేవతలు ఆకాశంలో నిలబడ్డారు.
అలా వెళ్తూ ఉండగా అక్కడ యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన మహర్షి గంగను మింగేశారు, భగీరథుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు వెంటనే భగీరధుడు జహ్ను మహర్షి ని ప్రార్ధించగా మహర్షి తన చెవుల నుండి గంగను వదిలాడు.
జహ్ను మహర్షి చెవుల నుండి వచ్చింది కనుక గంగను జాహ్నవి అంటారు. అలా గంగా పాతాళలోకానికి వెళ్లి అక్కడ భగీరథుడి పితృదేవతల భస్మల మీదగా ప్రవహించింది, దానితో సగరులు స్వర్గానికి వెళ్ళారు.
స్వర్గలోకములో ప్రవహించేటప్పుడు గంగను మందాకినీ అని, భగీరథుడు భూమిమీదకి తెచ్చాడు కనుక భాగీరధీ, భగవతి అని పిలుస్తారు.
ఈ విధముగా గంగావతరణం జరిగింది.
ఇది విన్న రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఒక నగరానికి వెళ్లారు.
దశరథుడు అయోధ్యకు చేరటం పరశురాముడు. వెళ్ళగానే రాముడు. విష్ణుధనుస్సును, బాణాలను. వరుణ దేవునికి సమర్పించాడు. దశరథునికి వసిష్టాది. మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు. అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక నీవు ఆతడిని గూర్చి చింతించటం మాను. మనమందరమూ అయోధ్యకు పోదాం. వాన చినుకులకు ఎదురు చూచే చాతక పక్షులవలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు. రాముని మాటలు విన్న దశరథుడు స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్థన్మ ఎత్తినట్లుగా ఆనందపడిపోయాడు. దశరథుని పరివారమంతా అయోధ్యా నగరం చేరుకున్నారు. నగర వీథులన్నీ నీళ్ళుచల్లి, వీథి వీథికీ తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు. వారంతా అంతఃపురానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురువచ్చి సీత, ఊర్మిళ, మాండవీ, శృతకీర్తులను అనురాగంతో అ...
శివ ధనస్సు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగము ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి); యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజుషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్నా ఆ మంజుషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజు పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము (జనకుని కూతురు కనుక జానకి, మిథిలానగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేన...
గొప్ప త్యాగం శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానందుడు చేతులు జోడించి "రాక్షసోత్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు, "వెళ్లి త్వరగా రా” అన్నాడు రాక్షసుడు. శివానందుడు త్వరగా ఇంటికివెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి "అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను." అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు" అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి "నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి" అన్నాడు. అంతలో ఒక ముత్తయిదువ వచ్చి "భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను"...
Comments