ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Ksheera sagara Madhanam enduku jarigindi?
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
క్షీరసాగర మధనం ఎందుకు జరిగింది?
గంగావతరణం గురించి తెలుసుకున్నాక తర్వాతి రోజు వారు ఒక నగరానికి వెళ్తారు, ఆ నగరం గురించి చెప్పమని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడుగుతారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు:
పూర్వం కృతయుగం(సత్యయుగం)లో కశ్యప ప్రజాపతి ఇరువురి భార్యలైన అదితి మరియు దితి వారి పుత్రులు అయినా దేవతలు, రాక్షసులు ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వారికి శాశ్వతంగా జీవించాలి అని కోరిక పుట్టింది దానితో వారు క్షీర సాగరాన్ని మధిస్తే అమృతం వస్తుంది. దానితో మనకు ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు అని క్షీరసాగరాన్ని మధించాలి అని నిర్ణయించుకున్నారు.
దానికోసం మంధర పర్వతాన్ని పెకళించి తీసుకువచ్చి క్షీరసాగరం లో పడివేశారు. వాసుకిని తాడుగా ఆ పర్వతానికి చుట్టారు. మందర పర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరాన్ని చిలక సాగారు.
అలా చిలుకుతుండగా 1000 సంవత్సరాలు తరువాత అందులోనుంచి ముందుగా హాలాహలం పుట్టింది. దానితో ఆ హాలాహలం రాక్షసులని, దేవతలను, మనుషులను అలాగే లోకం మొత్తం నాశనం అవ్వడం మొదలయింది.
అప్పుడు దేవతలంతా రక్షించమని మహేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు అక్కడికి వచ్చిన విష్ణుమూర్తి నవ్వుతూ శివుడితో అందరికన్నా పెద్ద వారు మీరే కనుక మొదట వచ్చిన దానిని మీరే స్వీకరించాలి అని అన్నారు.
అప్పుడు ఆ హాలాహలాన్ని శివుడు తాగాడు కానీ అతనికి ఏమీ కాలేదు.
సంతోషంతో మళ్లీ మంధర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు, అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది వెంటనే అందరూ పర్వతాన్ని పైకి తీసుకు రమ్మని విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. దానితో మళ్లీ క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టారు.
కొన్ని సంవత్సరాలు తరువాత చీర సాగరం నుండి ధన్వంతరీ, అప్సరసలు పుట్టారు నీళ్లను మధించగా వచ్చిన రసం నుండి పుట్టారు కనుక వారిని అప్సరసలు అంటారు. అలా వచ్చిన అందమైన అప్సరసలను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు, అందుకే వారు దేవ వేశ్యలు అయ్యారు.
తరువాత వరుణిని కుమార్తె అయిన వారుణి అనే సురసం(అంటే మద్యం) అనే రసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కనుక వారిని సురులు అంటారు, రాక్షసులు ఆ సుర రసాన్ని స్వీకరించలేదు కనుక వారిని అసురులు అంటారు.
మళ్లీ మంధర పర్వతాన్ని చిలకగా ఉచ్చైశ్రవం అనే గుర్రం కౌస్తుభము అని మణి వచ్చాయి.
ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని రాక్షసులు స్వీకరించారు, కౌస్తుభము అనే మణిని విష్ణువు ధరించాడు.
తరువాత అమృతం పుడుతుంది. అమృతం కోసం దేవదానవులు పోట్లాడుకుంటూ వుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అమృతాన్ని దొంగిలించాడు. దానితో దేవతలకు అమృతం దొరుకుతుంది.
అమృతం కోసం దేవతలు, దానవులు యుద్ధం చేసుకున్నారు, ఆ యుద్ధంలో అసురులు నాశనమయ్యారు.
దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు అసురులను చంపి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు.
అప్పుడు అసురుల తల్లి అయినది దితి తన భర్త అయిన కశ్యపు దగ్గరకు వెళ్లి నీ కుమారుడైన ఇంద్రుడు నా కొడుకులను నాశనం చేసాడు, నాకు ఇంద్రుడిని జయించే కొడుకు కావాలి అని అడిగింది, అప్పుడు కశ్యపుడు ఏమన్నాడో తర్వాత తెలుసుకుందాం
దశరథుడు అయోధ్యకు చేరటం పరశురాముడు. వెళ్ళగానే రాముడు. విష్ణుధనుస్సును, బాణాలను. వరుణ దేవునికి సమర్పించాడు. దశరథునికి వసిష్టాది. మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు. అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక నీవు ఆతడిని గూర్చి చింతించటం మాను. మనమందరమూ అయోధ్యకు పోదాం. వాన చినుకులకు ఎదురు చూచే చాతక పక్షులవలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు. రాముని మాటలు విన్న దశరథుడు స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్థన్మ ఎత్తినట్లుగా ఆనందపడిపోయాడు. దశరథుని పరివారమంతా అయోధ్యా నగరం చేరుకున్నారు. నగర వీథులన్నీ నీళ్ళుచల్లి, వీథి వీథికీ తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు. వారంతా అంతఃపురానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురువచ్చి సీత, ఊర్మిళ, మాండవీ, శృతకీర్తులను అనురాగంతో అ...
శివ ధనస్సు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగము ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి); యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజుషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్నా ఆ మంజుషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజు పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము (జనకుని కూతురు కనుక జానకి, మిథిలానగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేన...
గొప్ప త్యాగం శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానందుడు చేతులు జోడించి "రాక్షసోత్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు, "వెళ్లి త్వరగా రా” అన్నాడు రాక్షసుడు. శివానందుడు త్వరగా ఇంటికివెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి "అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను." అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు" అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి "నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి" అన్నాడు. అంతలో ఒక ముత్తయిదువ వచ్చి "భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను"...
Comments