ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Rishyasringunni Angadesaniki Tesukuvachina upayamu emiti?

 

ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకువచ్చిన ఉపాయం ఏమిటి?


ఋష్యశృంగుని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా రోమపాద మహారాజుకి పురోహితుడు ఈ విధముగా చెప్పాడు. 
మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుండి అడవులలోనే ఉండి వేదాద్యము లోను,తపస్సు చేయటము లోను జీవితాన్ని గడిపాడు. 
అతనికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది వేశ్యలను అలంకరించి, పూలు పెట్టి, సుగంధాలు వెదజల్లేలా తయారుచేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగ మహర్షి ని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు. 

రోమపాద మహారాజు ఆ ఉపాయాన్ని ఒప్పుకొని కొంతమంది వేశ్యలను చక్కగా అలంకరింప చేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. 
వారు ఆశ్రమము బయట ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి చూస్తున్నారు. 
ఆ ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ తండ్రికి సేవలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆశ్రమము దాటి వెళ్ళేవాడు కూడా కాదు. 
అలాంటిది ఒకనాడు ఎందుకో ఆశ్రమం బయటకి వచ్చాడు. వెంటనే వేశ్యలు పాటలు పాడుతూ అతని దగ్గరకి వచ్చారు. 

వారు అందమైన ఆకారాలు,అలంకరణలు, పాటలు, శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు. 
కానీ వారు స్త్రీలు అని కూడా అతనికి తెలియరు. 
వేశ్యలు అతని దగ్గరకు వెళ్లి ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు?
ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నారు అని అడిగారు. 
అప్పుడు ఋష్యశృంగ ముని ఇలా చెప్పారు: నేను విభుండక మహాముని కొడుకును, అదే మా ఆశ్రమం. 
మీరు మా ఆశ్రమానికి వచ్చినట్లైతే మీకు పద్దతి ప్రకారం పూజలు చేస్తాను అని అన్నాడు. 
అప్పుడు వేశ్యలు అతని వెంట ఆశ్రమానికి వెళ్లి అతను ఇచ్చినా కందమూలాలు మరియు ఫలాలు తిన్నారు. 
అక్కడ ఎక్కువసేపు ఉంటే విభుండకముని శపిస్తారని బయపడి వేశ్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చినా భక్ష్యాలు ఇచ్చి ఇవి మా పండ్లు, వీటిని కూడా రుచి చూడు అని చెప్పి ఇక మేము వెళ్లి తపస్సు చేసుకోవాలి అని చెప్పి ఋష్యశృంగుడి ని ఆలింగనం చేసుకొని ఆశ్రమము దాటి వెళ్లిపోయారు. 

ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు  తిని అవి పండ్లే అనుకున్నాడు. 
తనలో తానూ ఇలా అనుకున్నాడు: ఆ పండ్లు తానూ రోజు తినే పండ్ల కంటే చాలా తియ్యగా ఉన్నాయి, అలాగ తన ఆతిధ్యం తీసుకున్నవారు మాములు మునులు కంటే చల్ల అందముగా ఉన్నారు అని అనుకున్నాడు . 

ఆరోజంతా అతను వికలమైన మనస్సుతో గడిపాడు. 
మరునాడు వారు కనిపించవచ్చు అని ఆశతో కిందటి రోజు వారు కనిపించిన చోటుకే వెళ్ళాడు. 
అతనిని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరింది అనుకున్నారు. 
వారు అతనితో అయ్యా ! నువ్వు కూడా మా ఆశ్రమానికి రా, అక్కడ నీకు చక్కగా మర్యాదలు చేస్తాము అన్నారు. 

ఋష్యశృంగుడు దానికి చాలా సంతోషించి ఒప్పుకొని ఆశ్రమము విడిచి వారి వెంట బయలుదేరాడు. 
ఋష్యశృంగుడు అంగదేశానికి వచ్చిన వెంటనే అక్కడ వర్షం కురిసింది. 
రోమపాద మహారాజు ఋష్యశృంగునికి ఎదురు వచ్చి, సాష్టాంగ నమస్కారం చేసి తాను అతనిని ఈ విధముగా అంగదేశానికి రప్పించినందుకు క్షమాపణ చెప్పి తన కూతురైన శాంతను ఇచ్చి శాస్త్రం ప్రకారం పెళ్లి చేసాడు. 

ఋష్యశృంగుడు శాంతతో కూడా సకల సుఖాలు అనుభవిస్తూ అంగదేశములోనే ఉండిపోయారు. 
సుమంతుడు చెప్పిన ఈ కథ విని దశరథ మహారాజు సంతోషించి వసిష్ఠుని అనుమతి తీసుకొని తన భార్యలు, మంత్రులు సమేతముగా 
అంగదేశానికి వెళ్ళాడు . 

రోమపాదుడు దశరథుణ్ణి సాదరముగా ఆహ్వానించి అతిధి సత్కారాలు చేసాడు. 
అంగరాజు పక్కన అగ్ని వలే ప్రకాశిస్తున్న ఋష్యశృంగుడిని చూసాడు. 
రోమపాద మహారాజు దశరథుడికి ఋష్యశృంగుడు ని పరిచయం చేసాడు. 
దశరథుడు అంగ రాజ్యములో 7 రోజులు ఉన్నాడు. 
ఎనిమిదోవ రోజున తానూ వచ్చిన పని తెలిపాడు. 
ఆ పని ఏమిటంటే ఓ అంగరాజా ! నేను ఒక యజ్ఞం చేయ సంకల్పించాను. ఆ యజ్ఞంకు నే కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగ మహర్షిని అయోధ్య కు పంపవలిసింది అని ప్రార్థించాడు. దానికి అంగరాజు ఒప్పుకున్నారు. 

ఋష్యశృంగ మహర్షి సతిసమేతముగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. 
దశరథ మహారాజు ముందుగానే అయోధ్య ప్రజలకు ఋష్యశృంగ మహార్షి ఆహ్వానానికి ఘనముగా స్వాగతము పలకాలని చెప్పి ఆదేశించారు. 

అలాగే అయోధ్య ప్రజలు,దశరథ మహారాజు ఋష్యశృంగ మహార్షి కి శాంతా కి ఘనముగా స్వాగతము పలికారు. 
శాంత, ఋష్యశృంగలు అయోధ్య లో కొంతకాలం ఉన్నారు. 
ఇంతలో వసంత ఋతువు వచ్చింది. 
వసంత ఋతువు లో తాను తలపెట్టిన యజ్ఞం చెయ్యాలని దశరథ మహారాజు సంకల్పించారు. 
దశరథుడు ముని శ్రేష్ఠుడైన ఋష్యశృంగుడి వద్దకు వెళ్లి తనకు పుత్ర సంతానం కలిగేలా  యజ్ఞం చేయవలిసిందిగా ప్రార్థించారు. 
దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుడిని ఉండవల్సిందిగా అభ్యర్దించాడు. 
దానికి ఋష్యశృంగ మహార్షి ఒప్పుకున్నారు. 




←Prev                                                                                                                                                                                    Next→
                                            

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు